నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట!
- November 13, 2017
ఇదొక ఆత్మీయ కలయిక. ఒక వైపు ఏషియాన్ సదస్సు, మరోవైపు దానికొచ్చిన మిగతా దేశాధినేతలతో పలకరింపులు, డిన్నర్ మీటింగులు! ఫిలిప్పైన్స్ టూర్ లో ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ తో సతమతమవుతున్నారు. అయినా కాసింత తీరిక చేసుకుని మనీలాలోని 'మహావీర్ ఫిలిప్పైన్ ఫౌండేషన్'కి వెళ్లారు మోదీ.
అక్కడున్న అనేక మంది వికలాంగుల్ని పరామర్శించారు. కార్లో మిగెల్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడినయితే ప్రత్యేకంగా దగ్గరకు తీసుకుని.. ముద్దాడారు. అతడి మోకాళ్ళ కింద అమర్చిన 'జైపూర్' కృత్రిమ కాలు ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నాడు.
''ఒక కాలు లేకపోతేనేం.. పెద్దయ్యాక ఈ జైపూర్ కాలుతోనే పోలీస్ నవుతా'' అంటూ ఆ పిల్లాడు చెప్పిన మాటల్ని విని మురిసిపోయారు మన ప్రధాని మోది! ఈరోజే నా 'బుల్లి ఫ్రెండ్'ని కలిశా.. వాడు పోలీసవుతాడట.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









