తాలిబన్లతో చర్చలు జరపాలనుకుంటున్న అగ్రరాజ్యమ్
- November 13, 2017
తాలిబన్లతో చర్చలు జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్తాన్లో సైనిక ఘర్షణలకు స్వస్తి పలకాలంటే సాధ్యమైనంత త్వరలో చర్చలు జరగాలని భావిస్తున్నట్లు అమెరికా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘన్లో పరిస్థితి చక్కబడకుండా తొందరపడి అక్కడ నుండి అమెరికన్ బలగాలను వెనక్కి పిలిపిస్తే అల్ఖైదా, ఐసిస్లు బలోపేతమయ్యే పరిస్థితి వుంటుందని పేర్కొంటూ పరిస్థితి మెరుగయ్యేవరకు తమ బలగాలు అక్కడే వుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆగస్టులో దక్షిణాసియా విధానాన్ని వెల్లడిస్తూ ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్లో వివిధ రకాలైన దౌత్యపరమైన చొరవలు కొనసాగుతున్నప్పటికీ ముఖాముఖి చర్చలు జరపాల్సిన అవసరం వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా వ్యవహారాలు చూసే సహాయ మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు ఎప్పుడు జరిగేదీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ట్రంప్ చాలా బిజీగా వున్నారని, సాధ్యమైనంత త్వరలో చర్చలు జరపాలని భావిస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







