ఆదివారం రాత్రి నుంచి చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు
- November 13, 2017
- పాఠశాలలకు సెలవులు
కొంత విరామం తరువాత ఆదివారం రాత్రి మళ్లీ చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం నుంగం బక్కమ్ వద్ద 52 మీమీ, మీనంబక్కమ్ వద్ద 18.2 మీమీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఉత్తర తీర ప్రాంతంలోనూ, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లా కలెక్టర్లు సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చెన్నై జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. రహదారులపై నీటి ప్రవాహం పొంగిపొర్లడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చొచ్చుకుని వచ్చింది. పూనమలీ హై రోడ్, చింతదిర్పేట్, కిల్పౌక్.. వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు రావడంతో అధికారులు పూర్తి అప్రమత్తమయ్యారు.
చెన్నై కార్పొరేషన్లో ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







