ఆదివారం రాత్రి నుంచి చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు
- November 13, 2017
- పాఠశాలలకు సెలవులు
కొంత విరామం తరువాత ఆదివారం రాత్రి మళ్లీ చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం నుంగం బక్కమ్ వద్ద 52 మీమీ, మీనంబక్కమ్ వద్ద 18.2 మీమీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఉత్తర తీర ప్రాంతంలోనూ, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లా కలెక్టర్లు సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చెన్నై జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. రహదారులపై నీటి ప్రవాహం పొంగిపొర్లడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చొచ్చుకుని వచ్చింది. పూనమలీ హై రోడ్, చింతదిర్పేట్, కిల్పౌక్.. వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు రావడంతో అధికారులు పూర్తి అప్రమత్తమయ్యారు.
చెన్నై కార్పొరేషన్లో ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







