తెలంగాణ పీసీసీ అధ్యక్షురాలిగా డీకే అరుణ
- November 14, 2017
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ చేపట్టాక టీ-పీసీసీలో కూడా భారీ మార్పులే జరుగుతాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐతే, పీసీసీ పదవిని ఈసారి మహిళా నేతకే కట్టబెట్టే అవకాశాలున్నాయని గాంధీభవన్లో వార్తలు జోరందుకున్నాయి. ఇంతవరకూ తెలంగాణా కేబినేట్లో మహిళలకు స్ధానం కల్పించలేదని, అధికార టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తాము మహిళలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నది హస్తం నేతల ఆలోచన. అందుకే గద్వాల జేజమ్మగా చెప్పుకునే డీకే అరుణ పేరు.. ఆ పార్టీ కేడర్లో వైరల్ అవుతోంది.
కొద్దినెలలుగా పీసీసీ మార్పుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో అరుణ పేరు బయటికి రావడం ఆసక్తి రేపుతోంది. పీసీసీ మార్పు ఉంటుందని తెలంగాణా ఇన్చార్జి కుంతియా చెబుతుంటే, మార్పు లేకపోతే సీనియర్లు జారుకునే ప్రమాదం కూడా ఉందని ఢిల్లీకి సమాచారం వెళ్లింది. అందుకే పీసీసీని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఇటీవల చేరిన రేవంత్రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆయన జిల్లాకే చెందిన అరుణకు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారన్న వాదనా లేకపోలేదు.
ఒకే జిల్లాకు రెండు కీలక పదవులు ఎలా ఇస్తారని కొందరంటుంటే, ఇంతకాలం పీసీసీ, సిఎల్పి పదవులు ఒకే జిల్లాకు ఇవ్వలేదా అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ పట్టాభిషేకం తర్వాత భారీ మార్పులు మాత్రం ఖాయంగా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







