మాల్యా కోసం ఆర్థర్ రోడ్లో జైలు సిద్దం!
- November 14, 2017
ఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకులలో వేల కోట్లు రుణాలు తీసుకొని ప్రస్తుతం లండన్లో నివాసం ఉంటున్న రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్లోని జైలు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సరైన సదుపాయాలుగల జైలు లేదని విజయ్ మాల్యా సాకులు చెప్తుండటంతో భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి ఈ స్పష్టతనిచ్చింది. తనను భారతదేశానికి అప్పగించడంలో మరింత ఆలస్యమయ్యేలా చేయడానికి మాల్యా ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారు. భారతదేశంలోని జైళ్ళలో తన జీవితానికి, ప్రాణాలకు రక్షణ ఉండదని మాల్యా ఆరోపిస్తున్నారు. ఈ నెల 20న బ్రిటన్ కోర్టు ఈ కేసులో విచారణ జరుపుతుంది. భారతదేశంలోని జైలు వివరాలను తెలియజేయడానికి ఆర్థర్ రోడ్ జైలు అధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు బ్రిటన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మాల్యా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కట్టుదిట్టమైన వాదనలను వినిపించబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







