మాల్యా కోసం ఆర్థర్ రోడ్లో జైలు సిద్దం!
- November 14, 2017
ఢిల్లీ: దేశంలోని వివిధ బ్యాంకులలో వేల కోట్లు రుణాలు తీసుకొని ప్రస్తుతం లండన్లో నివాసం ఉంటున్న రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్లోని జైలు సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సరైన సదుపాయాలుగల జైలు లేదని విజయ్ మాల్యా సాకులు చెప్తుండటంతో భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి ఈ స్పష్టతనిచ్చింది. తనను భారతదేశానికి అప్పగించడంలో మరింత ఆలస్యమయ్యేలా చేయడానికి మాల్యా ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారు. భారతదేశంలోని జైళ్ళలో తన జీవితానికి, ప్రాణాలకు రక్షణ ఉండదని మాల్యా ఆరోపిస్తున్నారు. ఈ నెల 20న బ్రిటన్ కోర్టు ఈ కేసులో విచారణ జరుపుతుంది. భారతదేశంలోని జైలు వివరాలను తెలియజేయడానికి ఆర్థర్ రోడ్ జైలు అధికారులు, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు బ్రిటన్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మాల్యా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కట్టుదిట్టమైన వాదనలను వినిపించబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







