బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్‌

- November 15, 2017 , by Maagulf
బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్‌

 పద్మావతి సినిమా వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణకు దావూద్ ఇబ్రహీం సాయం చేశాడని కర్ణిసేన ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో పద్మావతి సినిమాను విడుదల చేస్తే అన్ని థియేటర్లను ధ్వసం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. డిసెంబరు 1న పద్మావతి సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. డిసెంబరు 1న పద్మావతి సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే (పద్మావతి), రణవీర్‌ సింగ్‌ (అల్లావుద్దీన్‌ ఖిల్జీ) పాత్రలు పోషిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com