రోహ్తంగ్ పాస్ను మూసివేసిన హిమాచల్ సర్కారు
- November 17, 2017
మనాలి: హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది.హిమపాతం రోడ్లను కప్పేసింది. దీంతో హిమాచల్లోని రోహ్ తాంగ్ పాస్ను మూసివేశారు. మార్చి వరకు రోహ్ తాంగ్ పాస్ను మూసేస్తామని హిమాచల్ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
రోహ్ తాంగ్ పాస్లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలకు పడిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సీజన్లో మంచు కురవడం ఇదే తొలిసారి. పశ్చిమ కల్లోలమే మంచు పడటానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు వీస్తుండటంతో జనం వణికిపోతున్నారు. కులూ మనాలీలో మంచు గడ్డకట్టేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. గుల్మర్గ్, సోనోమార్గ్, లేహ్ లోనూ భారీగా వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







