రీషూట్ దిశగా కేరాఫ్ సూర్య
- November 18, 2017
ఓ సినిమా హిట్ కాకపోతే ... ఆ చిత్ర యూనిట్ అంతా నిరాశ చెందుతుంది. కొన్ని సార్లు నిర్మాతలకు లాస్ కూడా వస్తుంది. కానీ థియేటర్స్ లో సినిమా స్ర్కీనింగ్ మాత్రం ఉంటుంది. డైరెక్టర్ సుశీంద్రన్ ఇటీవల తెరకెక్కించిన తమిళ్ ఫిల్మ్ నెంజిల్ తునివిరుందాల్...తెలుగులో కేరాఫ్ సూర్య. ఇందులో హీరో సందీప్ కిషన్. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా రిలీజైంది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ ట్రాక్ అందుకోలేదు. దీంతో డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం థియేటర్స్ తో స్క్రీనింగ్ కి అనుమతి ఉన్న అన్ని థియేటర్స్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు.
సందీప్ కిషన్, మెహరీన్ జంటగా నటించిన ఫిల్మ్ కేరాఫ్ సూర్య. రిలీజైన రోజు నుంచే సినిమాకు మంచి స్పందన రాలేదు. దీంతో డైరెక్టర్...హీరోయిన్ ఉన్న 20 నిమిషాల సీన్స్ ను కత్తెరించి మరి రిలీజ్ చేశారు. అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో డైరెక్టర్ ఇప్పుడు ఉపసంహరించుకొని...కొన్ని సీన్స్ రీషూట్ చేసి మళ్లీ రిలీజ్ చేసే పనిలో పడ్డాడట. హీరోయిన్ తో ఉన్న నిడివిని కట్ చేయడం...థియేటర్స్ ను సినిమా ఉపసంహరించుకోవడం అనేది కనీవినీ ఎరుగని సంగతి. బహుశ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. కొత్త సీన్స్ యాడ్ చేసి మళ్లీ డిసెంబర్ 15న రిలీజ్ చేసి చీకట్లో ఉన్న సూర్యుడుని వెలుగులోకి తెస్తారట. మరి ఈ కొత్త సూర్య కిరణాలు ప్రేక్షకులని తాకుతాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష