యువకుడిపై అత్యాచారం కేసులో యువతి అరెస్ట్
- November 18, 2017
బెంగళూరులో 17 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం చేశారన్న అభియోగంపై 24 ఏళ్ల యువతిని పోలీసులు అదువులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన యువతికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. బాధిత యువకుడు, యువతి ఇద్దరూ బెంగళూరులోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అత్యాచారానికి పాల్పడిన యువతిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక చర్య జరింగిందనే విషయంపై యువతీ, యువకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై బలాత్కారం చేసిన యువతి భర్త.. ఒక డ్రింకింగ్ వాటర్ సప్లయిర్గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







