'కణం' ట్రైలర్ విడుదల.!
- November 18, 2017_1511013556.jpg)
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'కణం'. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 'మా సారీ మా. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్' అనే డైలాగ్తో.. నాగశౌర్య, సాయిపల్లవి పెళ్లితో ట్రైలర్ ప్రారంభమైంది. 'కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను' అంటూ సాయిపల్లవి నాగశౌర్యతో అంటూ కనిపించారు. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసులు గాలించడం, ఇంటిలో పూజలు చేయడం..
తదితర సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఓ పాప చుట్టూ ఈ సినిమా కథ సాగేలా తెలుస్తోంది. 'కణం' చిత్రానికి సీఎస్ సామ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో 'కరు' అనే టైటిల్తో విడుదల చేయబోతున్నారు. సాయిపల్లవి 'ఫిదా' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నాని సరసన 'ఎం.సి.ఎ' చిత్రంలో నటిస్తున్నారు. నాగశౌర్య 'ఛలో' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష