రాజమౌళి మరో మల్టీస్టారర్‌.!

- November 18, 2017 , by Maagulf
రాజమౌళి మరో మల్టీస్టారర్‌.!

'బాహుబలి' దర్శకధీరుడు రాజమౌళి ఈసారి తీయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆయన మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. 2018 మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి.. చరణ్‌, తారక్‌తో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మల్టీస్టారర్‌ రాబోతోందన్న వార్త సోషల్‌మీడియాలో రాగానే అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే సినిమాకు టైటిళ్లు, బడ్జెట్‌, వసూళ్ల గురించి అంచనాలు వేసేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com