గోపీచంద్‌ 25వ చిత్రం షురూ.!

- November 18, 2017 , by Maagulf
గోపీచంద్‌ 25వ చిత్రం షురూ.!

ప్రముఖ నటుడు గోపీచంద్‌ 25వచిత్రం మొదలైంది. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కి జోడీగా మెహరీన్‌ నటిస్తోంది. కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది'గౌతమ్‌నంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్‌ త్వరలో'ఆక్సిజన్‌' చిత్రంతో రాబోతున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com