రస్ అల్ ఖైమాలో ఏషియన్ కార్మికుడి సజీవ సమాధి
- November 21, 2017
రస్ అల్ ఖైమా: 30 ఏళ్ళ కార్మికుడొకరు సజీవ సమాధి అయిన ఘటన రస్ అల్ ఖైమాలో చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, ల్యాండ్స్లైడ్ చోటు చేసుకుని, కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో బాధితుడ్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి మాట్లాడుతూ, ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరిని తమ రెస్క్యూ టీమ్స్ రక్షించాయని చెప్పారు. ఉదయం 10.35 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే అంబులెన్స్, పారా మెడిక్స్, రెస్క్యూ టీమ్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు మొహమ్మద్ అబ్దుల్లా. ఇద్దరు వ్యక్తుల్ని రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయనీ, వారికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఓ వ్యక్తిని మాత్రం కాపాడలేకపోయామని చెప్పారు. చట్ట పరమైన చర్యల నిమిత్తం రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖలకు ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







