ట్రిపుల్ తలాక్ పై నిషేధం దిశగా కేంద్రం అడుగులు
- November 21, 2017
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ను దేశంలో పూర్తిగా నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో దీన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏర్పాటైన మంత్రుల కమిటీ ట్రిపుల్ తలాక్ నిషేధంపై బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోక్సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండగా, రాజ్యసభలోనూ మిత్రులను కలుపుకుంటే ఈ బిల్లు సులువుగానే చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
ట్రిపుల్ తలాక్పై ఆగస్టులో సంచలనాత్మక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ట్రిపుల్ తలాక్ రాజ్యావిరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని అభిప్రాయపడింది. తలాక్ చెప్పే సంప్రదాయంపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ.. ఆ లోగా చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. సుప్రీం సూచనతో.. వెంటనే పని మొదలుపెట్టిన మోడీ సర్కార్.. బిల్లును సిద్ధం చేస్తోంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశ పెట్టనుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







