ట్రిపుల్ తలాక్ పై నిషేధం దిశగా కేంద్రం అడుగులు
- November 21, 2017
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ను దేశంలో పూర్తిగా నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో దీన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏర్పాటైన మంత్రుల కమిటీ ట్రిపుల్ తలాక్ నిషేధంపై బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోక్సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండగా, రాజ్యసభలోనూ మిత్రులను కలుపుకుంటే ఈ బిల్లు సులువుగానే చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
ట్రిపుల్ తలాక్పై ఆగస్టులో సంచలనాత్మక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ట్రిపుల్ తలాక్ రాజ్యావిరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని అభిప్రాయపడింది. తలాక్ చెప్పే సంప్రదాయంపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ.. ఆ లోగా చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. సుప్రీం సూచనతో.. వెంటనే పని మొదలుపెట్టిన మోడీ సర్కార్.. బిల్లును సిద్ధం చేస్తోంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశ పెట్టనుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం