అల్ ఖైదా టెర్రర్ గ్రూప్ అనుమానితుల అరెస్ట్
- November 21, 2017
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ముగ్గురు అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్కు చెందిన ఎస్టీఎఫ్ పోలీసులు వారిని కోల్కతా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.
వారి నుంచి పోలీసులు అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషద్్ మియా అలియాస్ తన్వీర్ అలియాస్ సైఫుల్ అలియాస్ తుషార్ బిశ్వా (26)గా గుర్తించారు. ఇతను బంగ్లాదేశ్వాసి.
మరో ఇద్దరిలో బంగ్లాదేశ్కు చెందిన రిజౌల్ ఇస్లామ్ అలియాస్ రియాజ్ అలియాస్ సుమోన్ (25), బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలోని ఖోలాపోటాకు చెందిన మోనోటోష్ డే అలియాస్ మోనా దా (46)గా గుర్తించారు.
ఈ మేరకు కోల్కతా ఎస్టీఎఫ్ పోలీసు అధికారి మురళీధర శర్మ మాట్లాడారు. ముగ్గురిని ఎస్టీఎఫ్ టీం అరెస్టు చేసినట్లు చెప్పారు. వారు ఏడాదన్నరగా భారత్లో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







