బీజేపీకి.. టీడీపీకి మధ్య వంశీ చిచ్చు
- November 22, 2017
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన నియోజకవర్గ పరిధిలోనే డెల్టా షుగర్స్ మూసివేత విషయంలో ఆయన కొన్నాళ్లుగా ప్రభుత్వంపై సీరియస్గా వున్నారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకి చెందిన డెల్టా షుగర్స్ నాలుగునెలల కిందట మూసివేశారు. దీన్ని మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది వంశీ ఆరోపణ.
అదే జరిగితే తమ ప్రాంతంలోని చెరకు రైతులు నష్టపోతారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొన్నాళ్లుగా ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో అటో ఇటో తేల్చుకుందామని బుధవారం ఆయన సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. కానీ, సీఎంవో అధికారులు ఆయనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన.. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రిజైన్ లెటర్ని స్పీకర్కి ఇవ్వడానికి వెళ్తుండగా, అక్కడేవున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకుని ఆ లెటర్ని చించివేశారు. సమస్య జఠిలంకావడంతో మంత్రి లోకేష్, వంశీకి సర్దిచెప్పేందుకు కళావెంకట్రావును పురమాయించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









