విజయవంతంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం
- November 22, 2017
న్యూదిల్లీ: ప్రపంచ అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైంది. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన సుఖోయ్-30ఎంకేఐ విమానం నుంచి తొలిసారిగా దీన్ని ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. రెండు దశల్లో చేపట్టిన ఈ ప్రయోగంలో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది.
ఈ ప్రయోగంతో 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చని నిరూపితమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది చేరుకోగలదని పేర్కొంది. దీని వల్ల వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. క్షిపణి ప్రయోగం విజయంతం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తంచేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







