గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్లో లభ్యం
- November 22, 2017
భారీ వర్షాల వల్ల తలెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఒమన్లో కనుగొన్నారు. నవంబర్ 16న 18 ఏళ్ళ ఆల్బర్ట్ జాయ్, తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాహనంలో షికారుకి వెళ్ళగా, ఆకస్మిక వరదల్లో ఆ కారు చిక్కుకపోయింది. ఎమిరేటీ వ్యక్తి ఒకరు అత్యంత సాహసోపేతంగా ఆ కారులోంచి ఐదుగుర్ని కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆల్బర్ట్ జాయ్ మాత్రం కారుతో సహా కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్బర్ట్ విద్యనభ్యసిస్తున్నాడు. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, బాధిత కుటుంబాన్ని నవంబర్ 21న పరామర్శించారు. షార్జా, అలాగే దుబాయ్ పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఈ ఘటన విషాదాంతమయ్యింది.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









