గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్‌లో లభ్యం

- November 22, 2017 , by Maagulf
గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్‌లో లభ్యం

భారీ వర్షాల వల్ల తలెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఒమన్‌లో కనుగొన్నారు. నవంబర్‌ 16న 18 ఏళ్ళ ఆల్బర్ట్‌ జాయ్‌, తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాహనంలో షికారుకి వెళ్ళగా, ఆకస్మిక వరదల్లో ఆ కారు చిక్కుకపోయింది. ఎమిరేటీ వ్యక్తి ఒకరు అత్యంత సాహసోపేతంగా ఆ కారులోంచి ఐదుగుర్ని కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆల్బర్ట్‌ జాయ్‌ మాత్రం కారుతో సహా కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.రస్‌ అల్‌ ఖైమాలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆల్బర్ట్‌ విద్యనభ్యసిస్తున్నాడు. దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌, బాధిత కుటుంబాన్ని నవంబర్‌ 21న పరామర్శించారు. షార్జా, అలాగే దుబాయ్‌ పోలీసులు, రెస్క్యూ టీమ్స్‌, అబుదాబీ పోలీస్‌ ఎయిర్‌ వింగ్‌ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఈ ఘటన విషాదాంతమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com