గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్లో లభ్యం
- November 22, 2017
భారీ వర్షాల వల్ల తలెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఒమన్లో కనుగొన్నారు. నవంబర్ 16న 18 ఏళ్ళ ఆల్బర్ట్ జాయ్, తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాహనంలో షికారుకి వెళ్ళగా, ఆకస్మిక వరదల్లో ఆ కారు చిక్కుకపోయింది. ఎమిరేటీ వ్యక్తి ఒకరు అత్యంత సాహసోపేతంగా ఆ కారులోంచి ఐదుగుర్ని కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆల్బర్ట్ జాయ్ మాత్రం కారుతో సహా కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్బర్ట్ విద్యనభ్యసిస్తున్నాడు. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, బాధిత కుటుంబాన్ని నవంబర్ 21న పరామర్శించారు. షార్జా, అలాగే దుబాయ్ పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఈ ఘటన విషాదాంతమయ్యింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







