నా పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ బీజేపీపై విరుచుకుపడ్డ ప్రకాష్
- November 23, 2017
నటుడు ప్రకాష్ రాజ్.. బీజేపీ మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేశారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ఇన్నాళ్లూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే మోడీ సర్కారుపై దాడి చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్.. ఇక ఫిజికల్ స్ట్రెంత్ చూపించడానికి 'గెట్ రెడీ' చెప్పేశారు. తన మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు ప్రకాష్ రాజ్. 'కొడుకు చనిపోయిన బాధలో వున్న భార్యను వదిలిపెట్టి ఒక డ్యాన్సర్ తో వెళ్ళిపోయిన మిస్టర్ ప్రకాష్ రాజ్.. మోదీ మీద, యోగీ మీద కామెంట్ చేసే నైతిక హక్కు నీకుందా?'' అంటూ అక్టోబర్ 2న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ నిశ్శబ్దంగా ఎందుకున్నారన్న ప్రకాష్ రాజ్ ప్రశ్నకు బదులుగా ఈ రియాక్షన్ వచ్చింది. ''ఇటువంటి పర్సనల్ అట్టాక్ ద్వారా.. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినందుకు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు.. నాకు సంజాయిషీ కావాలి.'' అన్నది ప్రకాష్ రాజ్ పంపిన లీగల్ నోటీసుల సారాంశం దీంతో.. ప్రకాష్ రాజ్.. డైరెక్ట్ గా బీజేపీతోనే పెట్టుకున్నట్లయింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









