నా పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ బీజేపీపై విరుచుకుపడ్డ ప్రకాష్
- November 23, 2017
నటుడు ప్రకాష్ రాజ్.. బీజేపీ మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేశారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ఇన్నాళ్లూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే మోడీ సర్కారుపై దాడి చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్.. ఇక ఫిజికల్ స్ట్రెంత్ చూపించడానికి 'గెట్ రెడీ' చెప్పేశారు. తన మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు ప్రకాష్ రాజ్. 'కొడుకు చనిపోయిన బాధలో వున్న భార్యను వదిలిపెట్టి ఒక డ్యాన్సర్ తో వెళ్ళిపోయిన మిస్టర్ ప్రకాష్ రాజ్.. మోదీ మీద, యోగీ మీద కామెంట్ చేసే నైతిక హక్కు నీకుందా?'' అంటూ అక్టోబర్ 2న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ నిశ్శబ్దంగా ఎందుకున్నారన్న ప్రకాష్ రాజ్ ప్రశ్నకు బదులుగా ఈ రియాక్షన్ వచ్చింది. ''ఇటువంటి పర్సనల్ అట్టాక్ ద్వారా.. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినందుకు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు.. నాకు సంజాయిషీ కావాలి.'' అన్నది ప్రకాష్ రాజ్ పంపిన లీగల్ నోటీసుల సారాంశం దీంతో.. ప్రకాష్ రాజ్.. డైరెక్ట్ గా బీజేపీతోనే పెట్టుకున్నట్లయింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







