ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే పునరావృతం చేస్తే ...దేశబహిష్కరణ
- November 23, 2017
కువైట్: సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం..అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న తదితర ఉల్లంఘనలను పునరావృతం చేస్తూ ఏ ప్రవాసీయుడైన వ్యవహరిస్తుంటే అటువంటివారిని దేశం నుండి బహిష్కరించాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనరల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆడెల్ అల్-హషాష్ పైన పేర్కొన్న తీరులో ఇటీవల, అధికారులు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్లను ధరించకపోవడం లేదా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలను నడపడం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. ఆయా అతిక్రమణలు పాల్పడినవారు వాహనాలను రెండు నెలల పాటు స్వాధీనం చేసుకొనే వీలు ట్రాఫిక్ చట్టం కల్పిస్తుంది, అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే పునరావృతం చేస్తే ...వారిని దేశబహిష్కరణ చేయడానికి సైతం వెనుకాడబోమని ఆంతరంగిక మంత్రిత్వశాఖ పేర్కొంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలని వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ అధికారులతో సహకరించడానికి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







