ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్‌షిప్‌

- November 25, 2017 , by Maagulf
ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్‌షిప్‌

ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్‌షిప్‌ని మంజూరు చేశారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచనల మేరకు, ఏర్పాటయిన కమిటీ, పౌరసత్వం కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, 309 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ప్రెసిడెన్షియల్‌ ఎఫైర్స్‌ డిప్యటీ మినిస్టర్‌ అహ్మద్‌ జుమా అల్‌ జాబి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, 46వ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌ సందర్భంగా ప్రెసిడెంట్‌ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా పౌరసత్వం పొందిన పౌరులు యూఏఈ చట్టాల పట్ల, నియమ నిబంధనల పట్ల అవగాహనతో ఉండాలనీ, యూఏఈ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com