బిత్తిరి సత్తి పై గుర్తు తెలియని దుండగుల దాడి..
- November 27, 2017
తీన్మార్ వార్తలు అనే షో ద్వారా సత్తి..పాపులర్ అయ్యాడు. డిఫరెంట్ గెటప్స్... మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిత్తిరి సత్తి.. ఇటీవల వెండి తెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ.. కెరీర్ లో తనదైన స్టైల్ లో దూసుకొని పోతున్న బిత్తిరి సత్తి అసలు పేరు కావాలి రవికుమార్. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తన బిత్తిరి వార్తల్లో నిలుస్తున్న సత్తి పై తాజాగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని అతను పనిచేస్తున్న టీవీ కార్యాలయం ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
బిత్తిరి సత్తి తన కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తున్న సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు సత్తిమీద హఠాత్తుగా దాడి చేసి.. జై భారత్.. జై భారత్ అనే నినాదాలు చేశారు ఈ దాడిలో సత్తికి బాగా దెబ్బలు తగిలాయి.. ఈ దాడిని చూసి అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది ఆ దుండగులను పట్టుకున్నారు. ఆ దుండగులు దాడి చేసే సమయంలో బాగా తాగి ఉన్నట్లు.. తెలుస్తోంది. గాయపడిన సత్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ దుండగులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







