బిత్తిరి సత్తి పై గుర్తు తెలియని దుండగుల దాడి..
- November 27, 2017
తీన్మార్ వార్తలు అనే షో ద్వారా సత్తి..పాపులర్ అయ్యాడు. డిఫరెంట్ గెటప్స్... మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిత్తిరి సత్తి.. ఇటీవల వెండి తెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ.. కెరీర్ లో తనదైన స్టైల్ లో దూసుకొని పోతున్న బిత్తిరి సత్తి అసలు పేరు కావాలి రవికుమార్. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తన బిత్తిరి వార్తల్లో నిలుస్తున్న సత్తి పై తాజాగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని అతను పనిచేస్తున్న టీవీ కార్యాలయం ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
బిత్తిరి సత్తి తన కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తున్న సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు సత్తిమీద హఠాత్తుగా దాడి చేసి.. జై భారత్.. జై భారత్ అనే నినాదాలు చేశారు ఈ దాడిలో సత్తికి బాగా దెబ్బలు తగిలాయి.. ఈ దాడిని చూసి అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది ఆ దుండగులను పట్టుకున్నారు. ఆ దుండగులు దాడి చేసే సమయంలో బాగా తాగి ఉన్నట్లు.. తెలుస్తోంది. గాయపడిన సత్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ దుండగులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







