బిత్తిరి సత్తి పై గుర్తు తెలియని దుండగుల దాడి..
- November 27, 2017
తీన్మార్ వార్తలు అనే షో ద్వారా సత్తి..పాపులర్ అయ్యాడు. డిఫరెంట్ గెటప్స్... మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిత్తిరి సత్తి.. ఇటీవల వెండి తెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ.. కెరీర్ లో తనదైన స్టైల్ లో దూసుకొని పోతున్న బిత్తిరి సత్తి అసలు పేరు కావాలి రవికుమార్. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తన బిత్తిరి వార్తల్లో నిలుస్తున్న సత్తి పై తాజాగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని అతను పనిచేస్తున్న టీవీ కార్యాలయం ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
బిత్తిరి సత్తి తన కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తున్న సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు సత్తిమీద హఠాత్తుగా దాడి చేసి.. జై భారత్.. జై భారత్ అనే నినాదాలు చేశారు ఈ దాడిలో సత్తికి బాగా దెబ్బలు తగిలాయి.. ఈ దాడిని చూసి అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది ఆ దుండగులను పట్టుకున్నారు. ఆ దుండగులు దాడి చేసే సమయంలో బాగా తాగి ఉన్నట్లు.. తెలుస్తోంది. గాయపడిన సత్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ దుండగులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









