షార్జాలో బస్ ఛార్జీల పెంపు
- November 28, 2017
డిసెంబర్ 1 నుంచి షార్జా సిటీ బస్ ట్రిప్స్కోసం వినియోగదారులు అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అన్ని సిటీ రూట్స్లోనూ, బస్ ఛార్జీలు పెరగబోతున్నట్లు ఆర్టిఎ వెల్లడించింది. 6 దిర్హామ్ల ఛార్జీకి బదులుగా ఇకపై 7 దిర్హామ్లను చెల్లించాల్సి ఉంటుంది. సాయెర్ కార్డులు కలవారు 4.5 దిర్హామ్లకు బదులుగా 5.5 దిర్హామ్లు చెల్లించాలి. నిర్వహణా వ్యయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ సిటీ బస్సుల్ని వినియోగిస్తుంటామని, ఈ ఛార్జీల పెంపు తమకు భారంగా మారనుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







