ఇండియా, ఫిలిప్పీన్స్కి పెరిగిన ఒమన్ ఎయిర్ బ్యాగేజీ అలవెన్స్
- November 28, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, బ్యాగేజ్ అలవెన్స్ని తమ ప్రయాణీకుల కోసం అదనంగా పెంచింది. డిసెంబర్ 15 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. మస్కట్ నుంచి ఇండియా, ఫిలిప్పీన్స్కి వెళ్ళే విమానాల్లో ఈ బ్యాగేజీ పెంపు వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ ప్రస్తుతం 30 కిలోల బరువుని అనుమతిస్తుండగా, ఇకపై 40 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తుంది. ముంబై కోచి, చెన్నయ్, ఢిల్లీ, తిరువనంతపురం, కాలికట్, హైద్రాబాద్ మరియు బెంగళూరులకు ఈ పెంపు వర్తిస్తుంది. మస్కట్ నుంచి ఫిలిప్పీన్ రాజధాని మనీలాకు వెళ్ళేవారు 50 కిలోల బ్యాగేజ్ తీసుకెళ్ళవచ్చు. ఫిలిప్పీన్, ఇండియా తమకు చాలా పాపులర్ డెస్టినేషన్స్ అనీ, ఈ మార్గాల్లో ప్రయాణించేవారికోసం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని ఒమన్ ఎయిర్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష