ఇండియా, ఫిలిప్పీన్స్కి పెరిగిన ఒమన్ ఎయిర్ బ్యాగేజీ అలవెన్స్
- November 28, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, బ్యాగేజ్ అలవెన్స్ని తమ ప్రయాణీకుల కోసం అదనంగా పెంచింది. డిసెంబర్ 15 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. మస్కట్ నుంచి ఇండియా, ఫిలిప్పీన్స్కి వెళ్ళే విమానాల్లో ఈ బ్యాగేజీ పెంపు వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ ప్రస్తుతం 30 కిలోల బరువుని అనుమతిస్తుండగా, ఇకపై 40 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తుంది. ముంబై కోచి, చెన్నయ్, ఢిల్లీ, తిరువనంతపురం, కాలికట్, హైద్రాబాద్ మరియు బెంగళూరులకు ఈ పెంపు వర్తిస్తుంది. మస్కట్ నుంచి ఫిలిప్పీన్ రాజధాని మనీలాకు వెళ్ళేవారు 50 కిలోల బ్యాగేజ్ తీసుకెళ్ళవచ్చు. ఫిలిప్పీన్, ఇండియా తమకు చాలా పాపులర్ డెస్టినేషన్స్ అనీ, ఈ మార్గాల్లో ప్రయాణించేవారికోసం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని ఒమన్ ఎయిర్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







