మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : కేటీఆర్

- November 28, 2017 , by Maagulf
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : కేటీఆర్

హైదరాబాద్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతపై జీఈఎస్ వేదిక వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మహిళలకు 33 శాతం బిల్లును పార్లమెంట్‌లో పెడితే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళా శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. మంత్రివర్గంలో మహిళలకు చోటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com