భారతీయ రోగికి అత్యవసరంగా "బాంబే గ్రూప్" రక్తం అవసరం
- November 29, 2017
కువైట్:' పురుషులందు ...పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ' ...రక్త సమూహాలలో బొంబాయి రక్తం వేరట... ప్రస్తుతం ఒక రోగికి ఆ రక్తం అవసరం ఏర్పడింది. అడాన్ హాస్పిటల్లో చేరిన భారతీయ రోగికి అత్యవసరంగా రక్తంలో ప్రత్యేక గ్రూప్ అవసరం ఏర్పడింది. ఈ గ్రూప్ రక్తం అత్యంత అరుదుగా లభ్యమవుతుందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ రక్తదాతలు తమ రక్తాన్ని ఇవ్వదలిచితే వెంటనే రఘుబాయి 6999 7588, రణజిత్ 5151 0076 లేదా యాసర్ 6676 9981 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక బొంబాయి రక్తం గలవారు మాత్రమే ఫోన్ కాల్ చేయమని రోగి బంధువులు అభ్యర్థిస్తున్నారు. " బాంబే బ్లడ్ గ్రూప్" అని పిలవబడే ఈ రక్త సమూహం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. 7,600 మంది ప్రజలలో ఒక్కరికి మాత్రమే ఆ రక్తం లభించడంతో ఆ రక్తదాత కోసం రోగి బంధువులు పరితపిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







