భారతీయ రోగికి అత్యవసరంగా "బాంబే గ్రూప్" రక్తం అవసరం
- November 29, 2017
కువైట్:' పురుషులందు ...పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ' ...రక్త సమూహాలలో బొంబాయి రక్తం వేరట... ప్రస్తుతం ఒక రోగికి ఆ రక్తం అవసరం ఏర్పడింది. అడాన్ హాస్పిటల్లో చేరిన భారతీయ రోగికి అత్యవసరంగా రక్తంలో ప్రత్యేక గ్రూప్ అవసరం ఏర్పడింది. ఈ గ్రూప్ రక్తం అత్యంత అరుదుగా లభ్యమవుతుందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ రక్తదాతలు తమ రక్తాన్ని ఇవ్వదలిచితే వెంటనే రఘుబాయి 6999 7588, రణజిత్ 5151 0076 లేదా యాసర్ 6676 9981 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక బొంబాయి రక్తం గలవారు మాత్రమే ఫోన్ కాల్ చేయమని రోగి బంధువులు అభ్యర్థిస్తున్నారు. " బాంబే బ్లడ్ గ్రూప్" అని పిలవబడే ఈ రక్త సమూహం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. 7,600 మంది ప్రజలలో ఒక్కరికి మాత్రమే ఆ రక్తం లభించడంతో ఆ రక్తదాత కోసం రోగి బంధువులు పరితపిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







