జైలు శిక్ష తప్పించుకున్న సౌదీ యువరాజు
- November 30, 2017
రియాద్: అవినీతి ఆరోపణలతో జైలుపాలైన సౌదీ అరేబియా సీనియర్ యువరాజు మితెబ్ బిన్ అబ్దుల్లా ప్రభుత్వంతో భారీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రూ.6,500కోట్ల(1బిలియన్ డాలర్ల)కుపైగా సర్కారుకు చెల్లించేందుకు మితెన్ బిన్ అంగీకరించారు.
అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 20రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. తాను సంపాదించిన మొత్తం అక్రమాస్తులను ఆయన సర్కారుకి అప్పగించేందుకు ఒప్పుకోవడంతో యువరాజును జైలు నుంచి విడుదల చేశారు.
ఈ మేరకు అక్కడి అధికారులు తెలిపారు. ఈ యువరాజుతోపాటు మరో ముగ్గురు కూడా ప్రభుత్వం ఇలాగే ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కాగా, సౌదీ ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







