డబ్బింగ్ పనులు పూర్తిచేసిన విక్రమ్

- November 30, 2017 , by Maagulf
డబ్బింగ్ పనులు పూర్తిచేసిన విక్రమ్

చెన్నై: 'మూవీ ఫ్రేమ్‌' బ్యానరుపై కలైపులి ఎస్‌.థాణు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం 'స్కెచ్‌'. ఇందులో విక్రమ్‌ కథానాయకుడు. ఆయనకు జంటగా తమన్నా నటిస్తున్నారు. హాస్య నటుడు సూరి, ఆర్‌కే సురేష్‌, అరుళ్‌దాస్‌, హరీశ్‌, శ్రీమాన్‌, మధుమిత ఇతర తారాగణం. ప్రధాన పాత్రలో శ్రీ ప్రియాంక నటిస్తున్నారు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తుండగా.... ఎస్‌.తమన్‌ సంగీతం అందించారు. కొంతకాలంగా నిర్మాణ పనులను వేగవంతం చేశారు.

అనంతరం డబ్బింగ్‌ పనులు చేపట్టారు. ఇటీవల విక్రమ్‌ సుమారు పది రోజులపాటు సమయం కేటాయించి నిర్విరామంగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పూర్తి చేశారు. బుధవారంతో ఇవి పూర్తయినట్లు చిత్ర బృందం వివరించింది. విక్రమ్‌ ఈ చిత్రం కోసం ఓ పాట ఆలపించారు.

ఆడియో విడుదల కార్యక్రమం త్వరలో జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com