పారిస్ దాడిని తీవ్రవాద దుశ్చర్య గా అభివర్ణించిన ఖలీఫా మొహమ్మద్

- November 14, 2015 , by Maagulf
పారిస్ దాడిని తీవ్రవాద దుశ్చర్య గా అభివర్ణించిన ఖలీఫా మొహమ్మద్

ఫ్రాన్స్ అధ్యక్షునికి పంపిన ఒక కేబుల్ సంతాప సందేశంలో, యు. ఎ. ఈ. అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాహ్యాన్, పారిస్ దాడిని తీవ్రవాదుల అమానుషమైన దుశ్చర్య అని అభివర్ణించారు. ఈ కష్టసమయంలో అంతేకాకుడా తీవ్రవాద వ్యతిరేక  పోరాటంలో కూడా యు. ఎ. ఈ, ఫ్రాన్స్ కు పూర్తీ మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. యు. ఎ. ఈ. ఉపాధ్యక్షులు మరియు  ప్రధాన మంత్రి, దుబాయి పరిపాలకులు ఐన హిజ్  హైనెస్  షేక్  మహమ్మద్  బిన్  రషీద్ అల్ మక్తౌం; అబుధాబి యువరాజు మరియు యు. ఎ. ఈ.  సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారు కుడా ఈ దుర్ఘటనకు తమ సంతాపాన్ని 

కేబుల్ ద్వారా తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com