ప్రధాని మోడీకి నోటీసులు పంపిన నిస్సాన్
- December 01, 2017
ఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్స్ భారత్పై ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఏకంగా రూ. 5వేల కోట్లకు దావా వేసింది. దీనికి సంబంధించి గతేడాదే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపారు. ఈ కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ను నిస్సాన్ కోరింది.
కాగా 2008లో నిస్సాన్ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. ఆ సమయంలో పన్ను రీఫండ్తో సహా పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు నిస్సాన్, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అయితే అప్పటి నుంచి తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదని నిస్సాన్ చెబుతోంది. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తాము ఈ విషయాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
దీనిపై నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ గోస్న్ గతేడాది మార్చిలో ప్రధాని మోడీకి స్వయంగా లేఖ రాశారని.. బకాయిలు చెల్లించేలా చూడాలని కోరినట్లు సంస్థ తెలిపింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాము ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించినట్లు పేర్కొంది. దీంతో గతేడాది జులైలో ప్రధాని మోడీకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







