ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- July 25, 2026
కువైట్ సిటీ: కువైట్లో చిక్కుకుపోయిన భారతీయ గృహ కార్మికురాలు తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తూ కువైట్లోని భారత రాయబార కార్యాలయం మానవతా దృక్పథంతో వేగంగా స్పందించింది.
పుదుచ్చేరికి చెందిన జయకుమారి అనే గృహ కార్మికురాలు పాస్పోర్టు, ఇతర ప్రయాణ పత్రాలకు సంబంధించిన సమస్యల కారణంగా భారత్కు తిరిగి వెళ్లలేకపోయారు. ఇదే సమయంలో ఆమె తండ్రి మరణించిన విషాద వార్త అందడంతో అత్యవసరంగా స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం, కువైట్ తమిళ్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్నారాయణన్, సామాజిక కార్యకర్త మతి సమన్వయంతో అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేశారు.
భారత రాయబారి పరిమితా త్రిపాఠి నేతృత్వంలోని కువైట్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసరంగా అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి, ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసింది. దీంతో జయకుమారి సమయానికి భారత్ చేరుకుని తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో వేగంగా స్పందించిన భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు. జయకుమారి కూడా ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన భారత రాయబార కార్యాలయం, కువైట్ తమిళ్ సంఘం, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







