పాక్ వర్సిటీలో తాలిబాన్ల దాడి, 13 మంది మృతి
- December 02, 2017
పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చి పోయారు. అయితే ఈసారి పాక్ భద్రతా బలగాలు సమర్థంగా ఆ దాడిని అడ్డుకోవటంతో పెద్ద సంఖ్యలో ప్రాణా లు బలికాలేదు. శుక్రవారం ఉదయం కొందరు ఉగ్రవాదులు బుర్ఖాలు ధరించి పెషావర్లోని వ్యవసాయ విశ్వవిద్యాల యంలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో 13మంది మృత్యు వాతపడ్డారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల్ని పాక్ సైన్యం మట్టుబెట్టిం ది. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి...చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలిం చారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరు గుతున్నాయి. ఉగ్రవాదులు రిక్షాలో క్యాంపస్లోకి ప్రవేశించి నట్టు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఓ బాంబు కూడా పేల్చినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతాదళాలు క్యాంపస్ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి.ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 400మంది విద్యార్థులు ఉండగా మిలాద్-ఉన్-నబి కావడంతో చాలామంది ఇండ్ల కు వెళ్లారు. దాడి జరిగిన సమయంలో విశ్వవిద్యాలయంలో 120 మంది విద్యార్థులు ఉన్నట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 2014లో పెషావర్లోని ఓ సైనిక పాఠశాలలో ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో 141 మంది విద్యార్థులు మృతి చెందారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







