శబరిమల: ఉప్పొంగిన పంబా నది..భక్తుల కష్టాలు
- December 02, 2017
శబరిమల: ఓఖీ తుఫాన్ దెబ్బకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో కేరళ వణికిపోతోంది. ముఖ్యంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలకు పంబా నది ఉప్పొంగి రాకపోకలు సాగడం లేదు. దీంతో నదిలో స్నానాలు చెయ్యవద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో భక్తుల ఇబ్బందిపడకుండా ఉండేందుకు గాను వారు ముందుకు వెళ్ళకుండా అధికారులు అపివేశారు. మరోపక్క నడకదారి కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇంకోవైపు ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎప్పుడు ఏ వృక్షం విరిగిపడుతుందో తెలియకుండా ఉంది. కొండపైకి వచ్చే భక్తులు నానా ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ పరిణామంతో రాత్రి సమయంలో రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. మరో రెండు రోజుల పాటు వర్షం ముప్పు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సర్కారు సూచించింది. ఇంతటి వర్షంలోనే కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







