పర్యాటక వీసాపై వెళ్లి...దుబాయ్ లో దొంగతనం చేసిన చైనా యువకులు
- December 02, 2017
దుబాయ్: చుట్టపు చూపుగా వెళ్లిన పర్యాటక వీసాపై దుబాయ్ వెల్లిన ఇరువురు చైనా యువకులు ఇళ్లకు కన్నం వేసి జైలుపాలయ్యారు. 25, 31 ఏళ్ల వయసున్న ఇద్దరు చైనా యువకులు పర్యాటక వీసా తీసుకుని దుబాయ్ నగరం వెళ్లారు. నగర అందాలను ఆశ్వాదించి తిరిగివెళ్లకుండా దొంగతనానికి పాల్పడ్డారు. ఎవరూలేని ఓ భవనాన్ని పరిశీలించి దొంగతనం చేశారు. 8 లక్షల దిర్హమ్ల విలువైన బంగారం, 2 లక్షల దిర్హమ్ల నగదు దొంగతనానికి పాల్పడ్డారు. పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చి బాధిత కుటుంబం కంగుతింది. ఇంట్లో బంగారం, డబ్బు దొంగతనానికి గురయ్యాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. వీరికి సహాయం చేసిన మరో వ్యక్తికి కూడా శిక్ష విధించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







