ఖాళీగా ఉండద్దు..ఏదో ఒక ఉద్యోగం చేయండి: మంత్రి లోకేష్

- December 02, 2017 , by Maagulf
ఖాళీగా ఉండద్దు..ఏదో ఒక ఉద్యోగం చేయండి: మంత్రి లోకేష్

2019 నాటికి ఇన్‌ఫర్మెషన్ టెక్నాలజీలో లక్ష, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ శనివారం అన్నారు. చదువుకున్న ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండకూడదని, మొదట్లో ఏ ఉద్యోగం దొరికినా అందులో చేరిపోవాలని సూచించారు. ఏపీ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఐటీ సలహాదారు జేఏచౌదరి మాట్లాడారు. ఈ జాబ్‌ మేళాలో 1087 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. మొదట యూనిటి 3డీ సంస్థ ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, కొలువు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com