ఏపీలో భారీ వర్షాలు.. ISRO హెచ్చరిక
- December 04, 2017
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి... ఏడో తేదీ నాటికి మధ్య, ఉత్తర కోస్తాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇస్రో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇస్రో అంచనా ప్రకారం ఈ నెల ఏడో తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం నాటి మోడల్స్ ప్రకారం వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఏడో తేదీ సాయంత్రం నుంచి పదో తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముంది. అయితే తీరం దిశగా వచ్చేసరికి తీవ్ర వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని విశ్లేషించింది. ఇస్రో హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







