హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'శివ గంగ'
- November 15, 2015
హార్రర్, కామెడీ చిత్రాలకు ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో ఈ నేపథ్యంలో వచ్చిన చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అయితే వారిని అలరించేందుకు మరో హార్రర్ సినిమా సిద్ధమవుతోంది. శ్రీరామ్, రాయ్లక్ష్మీ, సుమన్, మనోబాల, వడివుక్కరసిలు ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శివ గంగ'ను ఈ నెల 27న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాకు ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వం వహించగా, చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'అరుంధతి', 'కాంచన', 'చంద్రముఖి', 'గంగ', 'చంద్రకళ' చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా 'హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్'గా ఉంటుందని సినీ యూనిట్ చెబుతోంది. రెండు ఆత్మలు ప్రతీకారం తీర్చుకోవడమనే నేపథ్యంలో భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను తీర్చిదిద్దినట్టు నిర్మాతలు తెలిపారు. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుందని అన్నారు. హీరో శ్రీరామ్ ఇందులో శివ, శక్తి అనే రెండు పాత్రలను పోషించాడని, రాయ్లక్ష్మీ గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. దాదాపు 37 నిమిషాల పాటు దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







