హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'శివ గంగ'
- November 15, 2015
హార్రర్, కామెడీ చిత్రాలకు ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో ఈ నేపథ్యంలో వచ్చిన చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అయితే వారిని అలరించేందుకు మరో హార్రర్ సినిమా సిద్ధమవుతోంది. శ్రీరామ్, రాయ్లక్ష్మీ, సుమన్, మనోబాల, వడివుక్కరసిలు ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శివ గంగ'ను ఈ నెల 27న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాకు ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వం వహించగా, చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'అరుంధతి', 'కాంచన', 'చంద్రముఖి', 'గంగ', 'చంద్రకళ' చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా 'హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్'గా ఉంటుందని సినీ యూనిట్ చెబుతోంది. రెండు ఆత్మలు ప్రతీకారం తీర్చుకోవడమనే నేపథ్యంలో భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను తీర్చిదిద్దినట్టు నిర్మాతలు తెలిపారు. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుందని అన్నారు. హీరో శ్రీరామ్ ఇందులో శివ, శక్తి అనే రెండు పాత్రలను పోషించాడని, రాయ్లక్ష్మీ గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. దాదాపు 37 నిమిషాల పాటు దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







