500 కోట్లతో కెఐసిసిను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధ0
- November 15, 2015
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో రూ. 500 కోట్లతో కాకతీయ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (కెఐసిసి)ను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధమయ్యాయి. దీనికి ఇండియన్ టొబాకో అసోసియేషన్ (ఐటీఏ) మాజీ అధ్యక్షుడు, పొగాకు వ్యాపారి చేబ్రోలు నరేంద్రనాథ్ 5ఎకరాల స్థలం ఇవ్వడానికి అంగీకరించడం గమనార్హం. గుంటూరు పలకలూరు రోడ్డులో ఆదివారం పలు రాష్ట్రాలు, వివిధ జిల్లాలకు చెందిన కమ్మ సంఘం నేతలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలలో దీనిపై ప్రణాళికను రూపొందించారు. కెఐసిసి అధ్యక్షుడు జీవీ రాయుడు అధ్యక్షతన భారీ సభను నిర్వహించారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో పేద వర్గాలను ఆదుకోవడానికి కెఐసిసి ముందుకు రావాలని సూచించారు. రాజధానికి అనుసంధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి కల్పించాలని సూచించారు. సంస్థ చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. కాగా, సభకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కెఐసిసి సభ్యత్వాలను మంత్రి పుల్లారావు, స్పీకర్ కోడెల పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







