చంద్రుడిపై రోబో స్టేషన్ నిర్మించనున్న చైనా.!
- December 06, 2017చంద్రుడి భౌగోళిక స్వరూపంపై పరిశోధనలను మరింత వేగవంతం, విస్తృతం చేసే దిశగా చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిశోధనలకు అనుగుణంగా చందమామపై రోబో స్టేషన్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చంద్రమండలం నుంచి శిలల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు అవుతున్న భారీ వ్యయాన్ని ఈ స్టేషన్ ఏర్పాటుతో గణనీయంగా తగ్గించవచ్చునని చైనా భావిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థ బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. రోబో స్టేషన్లో పెద్ద సౌరవిద్యుత్తు ఉత్పత్తి యంత్రాన్ని ఏర్పాటుచేస్తారని.. ఫలితంగా చంద్రుడిపై ఇప్పుడున్న రోవర్ల కంటే రోబోల శక్తి సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని తెలిపింది. సంక్లిష్ట పరిశోధనలను సైతం వేగంగా పూర్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మరోవైపు, అంగారక గ్రహంపై పరిశోధనలకుగాను 2020 లోగా 'లాంగ్మార్చ్ 5' ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ రోవర్ను చైనా అంగారకుడిపై మోహరిస్తుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్