కువైట్ దేశానికి తదుపరి రాయబారి కె. జీవా సాగర్

- December 08, 2017 , by Maagulf
కువైట్ దేశానికి తదుపరి రాయబారి  కె. జీవా సాగర్

కువైట్ : మన తెలుగుతేజం ఎడారి దేశంలో రాయబారిగా వికసించనుంది. కువైట్ దేశానికి తదుపరి రాయబారిగా భారఃదేశానికి చెందిన కె.జీవ సాగర్  బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఈ మేరకు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో  అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కె.జీవ సాగర్ ఘనా దేశానికి ఇండియన్ హై కమిషనర్ గా పనిచేశారు.   బుర్కినా ఫాసో రిపబ్లిక్ మరియు టోగో రిపబ్లిక్ కు భారత రాయబారిగా  పనిచేశారు, . ఆయన త్వరలోనే కువైట్ రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com