కువైట్ దేశానికి తదుపరి రాయబారి కె. జీవా సాగర్
- December 08, 2017
కువైట్ : మన తెలుగుతేజం ఎడారి దేశంలో రాయబారిగా వికసించనుంది. కువైట్ దేశానికి తదుపరి రాయబారిగా భారఃదేశానికి చెందిన కె.జీవ సాగర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఈ మేరకు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కె.జీవ సాగర్ ఘనా దేశానికి ఇండియన్ హై కమిషనర్ గా పనిచేశారు. బుర్కినా ఫాసో రిపబ్లిక్ మరియు టోగో రిపబ్లిక్ కు భారత రాయబారిగా పనిచేశారు, . ఆయన త్వరలోనే కువైట్ రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్









