గల్ఫ్ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి

- December 08, 2017 , by Maagulf
గల్ఫ్ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి

హైదరాబాద్: ఈ నెల 15 నుంచి జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్ బాధితులను ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాగా తెలుగు మహాసభలు నిర్వహించడం మంచిదేనని, ప్రతిపక్షాలను తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com