మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు!
- December 08, 2017
ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఇద్దరు కవల పిల్లలు చనిపోయారని చెప్పి వారిని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ తీరు ఆమోదయోగ్యమైనది కాదని, అందుకే హాస్పిటల్ లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి నుంచి ఇక ఆ హాస్పిటల్లో రోగులకు చికిత్స అందిచడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల మ్యాక్స్ హాస్పిటల్లో జన్మించిన ఇద్దరు కవలలు చనిపోయినట్లు చెప్పి వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్తుండగా అందులో ఉన్న ఓ బిడ్డలో కదలికలు రావడం తండ్రి గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఇవ్వడంతో బతికి ఉన్న చిన్నారికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ చిన్నారి కూడా బుధవారం మృతి చెందింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







