మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు!
- December 08, 2017
ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఇద్దరు కవల పిల్లలు చనిపోయారని చెప్పి వారిని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ తీరు ఆమోదయోగ్యమైనది కాదని, అందుకే హాస్పిటల్ లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి నుంచి ఇక ఆ హాస్పిటల్లో రోగులకు చికిత్స అందిచడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల మ్యాక్స్ హాస్పిటల్లో జన్మించిన ఇద్దరు కవలలు చనిపోయినట్లు చెప్పి వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్తుండగా అందులో ఉన్న ఓ బిడ్డలో కదలికలు రావడం తండ్రి గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఇవ్వడంతో బతికి ఉన్న చిన్నారికి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ చిన్నారి కూడా బుధవారం మృతి చెందింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









