భారత్ ఎంతో ముఖ్యమైన దేశం : వాంగ్ యి
- December 11, 2017
భారత్తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు చైనా మరోసారి స్పష్టం చేసింది. అసియాలోనే బలమైన దేశాలుగా భారత్-చైనాలు కలిసే ముందుకు సాగాలని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి అభిలషించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఏర్పడే చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇరు దేశాల మధ్య అత్యంత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం వివాదాన్నికూడా నిగ్రహంతో, దౌత్యపరంగానే చైనా పరిష్కరించుకుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతికి చైనా కృషి చేస్తుందన్నారు.
డోక్లాం సరిహద్దులోకి భారత దళాలు అక్రమంగా ప్రవేశించినా.. చైనా ఉద్రిక్తతలు పెంచకుండా.. దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించిందని చెప్పారు. భారత్-చైనా దేశాలు భవిష్యత్లో ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని.. ఆయన చెప్పారు. గత అనుభవాల వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అనుమానాలు, సందేహాలు చాలానే ఉన్నాయని.. అయితే వాటిని నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వాంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, రష్యా, భారత్ దేశాల చర్చల్లో భాగంగా వాంగ్ యి పాల్గొననున్నారు. డోక్లాం వివాదం తరువాత చైనా అత్యున్నత మంత్రి ఒకరు భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







