తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు--జయలలిత
- November 16, 2015
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 71 మంది మృత్యువాతపడ్డారు. దీంతో జయలలిత సహాయ, పునరావాస చర్యలకు రూ.500కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో సహాయకచర్యల కోసం ఆర్మీ సహాయాన్ని కోరారు. పలు ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలను అందించాలని జయలలిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2.5లక్షల నుంచి రూ.4 లక్షలదాకా నష్టపరిహారం అందిస్తామని జయలలిత తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









