తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు--జయలలిత

- November 16, 2015 , by Maagulf
తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు--జయలలిత

 భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తమిళనాడులో సహాయచర్యలకు రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 71 మంది మృత్యువాతపడ్డారు. దీంతో జయలలిత సహాయ, పునరావాస చర్యలకు రూ.500కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో సహాయకచర్యల కోసం ఆర్మీ సహాయాన్ని కోరారు. పలు ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలను అందించాలని జయలలిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2.5లక్షల నుంచి రూ.4 లక్షలదాకా నష్టపరిహారం అందిస్తామని జయలలిత తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com