యాక్సిడెంట్ జరిగిన 12 నిమిషాల్లోనే ట్రాఫిక్ క్లియర్
- December 12, 2017
దుబాయ్:దుబాయ్లో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అలాగే దుబాయ్ పోలీస్ సంయుక్తంగా ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే, ప్రమాదం జరిగిన 12 నిమిషాల్లోగా ట్రాఫిక్ని క్లియర్ చేయడం ఈ కార్యాచరణ తాలూకు ఉద్దేశ్యం. ట్రాఫిక్ సంబంధిత ఎక్స్పెన్సెస్ని 25 శాతం తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమని ఆర్టిఎ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కీలక అంశాల్ని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్, దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలిఫా అల్ మర్రి సమక్షంలో చర్చించడం జరిగింది. దుబాయ్లో మెగా ఈవెంట్స్ సందర్భంగా ట్రాఫిక్ విషయమై తీసుకోవాల్సిన చర్యల గురించీ ఈ సమావేశంలో చర్చించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రుల్ని రికార్డు సమయంలో ఆసుపత్రులకు తరలించడం, అలాగే సంఘటనా స్థలం నుంచి క్లూస్ని సేకరించడం, ఆ వెంటనే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చూడటం వంటి చర్యల ద్వారా వాహనదారులకు ఊరటనిచ్చేందుకు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి