గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు

- December 13, 2017 , by Maagulf
గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు

కువైట్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ప్రవాసీయులు ఆకస్మికంగా మరణించి తమ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు.  గోవా నుండి భారత జాతీయుడు డిగో రిమ్మీ ఫెర్నాండెజ్, అద్దెకు కార్లను ఇచ్చేఅల్-సేయర్ సంస్థలో పని చేసేవారు.  ఆయన 58 సంవత్సరాల వయస్సులో గుండెకు సంబంధించిన వ్యాధి కార్డియక్ అరెస్ట్ కారణంగా ఈ నెల 10 వతేది (గురువారం) ఆకస్మికంగా చనిపోయారు. ఉన్నాడు. తన భార్య జోసెఫిన్ ఫెర్నాండెజ్ మరియు కుమార్తె డయానా ఫెర్నాండెజ్ లను అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. కాగా డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు రేపు  14/12/2017   ( (గురువారం) ఉదయం 11:30 గంటలకు కువైట్ నగరంలోని హోలీ ఫ్యామలీ కేథడ్రల్ చర్చి వద్ద జరుగుతాయి. ది క్రిస్టియన్ సెమెట్రీ , సులైబికత్ వద్ద ఖననం చేయబడుతుంది. డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ ఆత్మకు శాంతి కలగాలని కువైట్ లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రార్థిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com