ఈనెల 27న విదుదలకు సిద్ధం అవుతున్న 'తను నేను'..!!
- November 17, 2015
ష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్ హీరోయిన్గా, 'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా డి.సురేష్బాబు సమర్పణలో సన్షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్ పి. నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'తను నేను'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. దీపావళి కానుకగా రిలీజైన టీజర్కి చక్కని స్పందన వచ్చింది. ఈనెల 27న ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్రయూనిట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, యంగ్ హీరోలు నాని, రాజ్ తరుణ్లు హాజరయ్యారు. అవికా గోర్, సంతోష్ శోభన్, రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఎస్.రవీందర్, నిర్మాణం: సన్షైన్ సినిమాస్ ప్రై. లిమిటెడ్, వయాకామ్ 18 పిక్చర్స్ లిమిటెడ్, సమర్పణ: డి.సురేష్బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్ పి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









