బ్యాడ్ వెదర్: దుబాయ్ సఫారీ మూసివేత
- December 17, 2017వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున దుబాయ్ సఫారీ పార్క్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం), వాతావరణ పరిస్థితుల్లో అప్పటికప్పుడు విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది గనుక, అప్రమత్తంగా ఉండాలని రెసిడెంట్స్కి సూచించింది. భారీ వర్ష పాతం పలు ప్రాంతాల్లో కురవనుందని ఎన్సిఎం హెచ్చరించింది. ఇప్పటికే దుబాయ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాక, దుబాయ్ సఫారీ పార్క్ యధాతథంగా సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. సఫారీ పార్క్లో జంతువుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 12న ప్రారంభమైన దుబాయ్ సఫారీ పార్క్లో వివిధ రకాలైన 2,500 జంతువులు ఉన్నాయి. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?