అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికుల మృతి
- December 18, 2017
అల్ కోజ్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నిద్రలోనే ముగ్గురు కార్మికులు మృతి చెందడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియా 3 లో ఈ ప్రమాదం తెల్లవారు ఝామున 4.50 నిమిషాల సమయంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వేర్ హౌస్ ఓ ప్రైవేటు సంస్థకు చెందినది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి మొహమ్మద్ హమీద్ మాట్లాడుతూ, ఫైర్ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి పక్కనే వున్న మరో రెండు వేర్ హౌస్లకు కూడా మంటలు వ్యాపించాయనీ, మొత్తం 50 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ ఆ మంటలతో పోరాడి, వాటిని అదుపు చేశాయని చెప్పారు. 4 గంటల పాటు జరిగిన ఈ ఫైట్ అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు వ్యాపించగానే, చాలామంది కార్మికుల్ని అక్కడినుంచి పంపివేసినా, ముగ్గురు మాత్రం అందులో ఇరుక్కుపోయి మృతి చెందినట్లు వేర్ హౌస్ యజమాని తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి అటాప్సీ నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక