అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికుల మృతి
- December 18, 2017
అల్ కోజ్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నిద్రలోనే ముగ్గురు కార్మికులు మృతి చెందడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియా 3 లో ఈ ప్రమాదం తెల్లవారు ఝామున 4.50 నిమిషాల సమయంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వేర్ హౌస్ ఓ ప్రైవేటు సంస్థకు చెందినది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి మొహమ్మద్ హమీద్ మాట్లాడుతూ, ఫైర్ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి పక్కనే వున్న మరో రెండు వేర్ హౌస్లకు కూడా మంటలు వ్యాపించాయనీ, మొత్తం 50 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ ఆ మంటలతో పోరాడి, వాటిని అదుపు చేశాయని చెప్పారు. 4 గంటల పాటు జరిగిన ఈ ఫైట్ అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు వ్యాపించగానే, చాలామంది కార్మికుల్ని అక్కడినుంచి పంపివేసినా, ముగ్గురు మాత్రం అందులో ఇరుక్కుపోయి మృతి చెందినట్లు వేర్ హౌస్ యజమాని తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి అటాప్సీ నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







